వేములవాడ రాజన్న‌ను ద‌ర్శించుకున్న స‌జ్జ‌నార్‌

వేముల‌వాడ (CLiC2NEWS): ఆర్టీసీ ఎండీ విసి స‌జ్జ‌నార్ గురువారం ఉద‌యం వేముల వాడ రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ఇవాళ ఉద‌యం సజ్జ‌నార్ రాజ‌రాజేశ్వ‌ర‌స్వామి స‌న్నిధిలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న‌కు ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అందించారు. ఎండి సజ్జ‌నార్ వెంట క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి, ఆల‌య ఇఒ ర‌మాదేవీ ఇత‌ర అధికారులు ఉన్నారు.

ఇవాళ వేముల ఆల‌యానికి రావ‌డానికి ముందు తిప్పాపూర్ బ‌స్టాండును ప‌రిశీలించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎండి స‌జ్జ‌నార్ ఆల‌య‌, ఆర్టీసీ అధికారుల‌తో ప్రత్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. రాజ‌న్న ప్ర‌సాదం కార్గో ద్వారా భ‌క్తుల‌కు అంద‌జేసే అంశంపై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.