Visakhapatnam: పెళ్లిపీటలపై కుప్పకూలిన నవ వధువు
విశాఖపట్నం (CLiC2NEWS): నగరంలోని మధురవాడలో జరుగుతున్న వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లీపీటలపై వధువు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి స్పృహ కోల్పోయింది. దీంతో పెళ్లికుమార్తెను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. శివాజి, సృజనల వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం వివాహం జరుగుతున్న సమయంలో సృజన స్పృహ కోల్పోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. పెళ్లి కుమార్తె మృతితో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.