ఈతకని వెళ్లి.. నలుగురు చిన్నారులు మృతి
కర్నూలు (CLiC2NEWS): కర్నూలు జిల్లాలోని ఆలంకొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు బావిలో ఈతకు దిగి విద్యుదాఘాతంతో మృతిచెందారు. కార్తిక్, సాయి, రాకేష్, షేక్ కమల్బాషా గ్రామ శివారు పోలాల్లో ఉన్న బావికి ఈతకు వెళ్లారు. అందులో విద్యుత్తు మోటారు ఉంది. నీటిలో వారు ఈత కొడుతుండగా నీటిలో విద్యుదాఘాతం సంభవించి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి వరకు కళ్లముందు తిరిగిన పిల్లలు విగతజీవులై కనిపించేసరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.