వ‌రంగ‌ల్‌లో ఫ్లైఓవ‌ర్ నుంచి కింద ప‌డిన కారు.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): వ‌రంగ‌ల్‌లోని ఖ‌మ్మం బైపాస్ హంట‌ర్ రోడ్డు ఫ్లైఓవ‌ర్ నుంచి కారు కింద‌ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రొక‌రు ఎంజిఎంలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఖ‌మ్మం నుంచి వ‌రంగ‌ల్ వ‌స్తున్న కారు.. వ‌రంగ‌ల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మ‌రో కారు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఖమ్మం నుంచి వ‌స్తున్న కారు ఫ్లై ఓవ‌ర్ నుంచి కింద ప‌డిపోవ‌డంతో అందులో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిని ప్ర‌భుత్వ ఉద్యోగి సార‌య్య (42), ఆయ‌న భార్య సుజాత (39)గా గుర్తించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.