పోలీసుల‌ ఆధ్వర్యంలో డ్రగ్ డి-అడిక్షన్ అవగాహనా కార్యక్రమం

మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికి రెండు నెలల డి-అడిక్షన్ కోర్స్

మంచిర్యాల (CLiC2NEWS): మత్తు పదార్థాల కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకొంటున్నార‌ని డిసిపి అఖిల‌ల్ మ‌హాజ‌న్ అన్నారు. వారిని మ‌త్తు ప‌దార్థ‌ల నుండి విముక్తి చేయాలనే సదుద్దేశ్యంతో సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన నిపుణులు అయిన సైక్రియాటిస్ట్‌లతో మత్తు పదార్థాలు, డ్రగ్ డి-అడిక్షన్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియ‌జేశారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారినటువంటి వారికి డి-అడిక్షన్ కోర్స్ ను రెండు నెలల పాటు నిర్వహించడం జరుగుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కౌన్సెలింగ్ అవసరం ఉన్నవారు 91 83416 25367 నెంబర్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డిసిపి తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.