యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నగరానికి చేరుకున్నారు. యశ్వంత్ సిన్హాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రులు కెటిఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేగంపేట ఎయిర్పోర్టు్లో ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుండి జలవిహార్ వరకు టిఆర్ ఎస్ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం యశ్వంత్ సిన్హాకు జలవిహార్లో టిఆర్ ఎస్ సభ ఏర్పాటు చేసింది.