వీర సింహారెడ్డి విజయోత్సవపు వేడుకల్లో పాటపాడిన బాలయ్య..
హైదరాబాద్ (CLiC2NEWS): బాలకృష్ణ కథానాయకుడా నటించిన చిత్రం వీరసింహారెడ్డి విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా ఈ చిత్ర బృందం విజయోత్సపు వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్టేజ్పై నందమూరి బాలకృష్ణ.. మాతో పెట్టుకోకు సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా’.. అంటూ పాటను పాడి అందరిని అలరించారు. ఆయన నటించిన వీరసింహారెడ్డి ఇటీవల విడుదలై మంచి మాస్ ఎంటర్టైనర్గా నిలిచింది. శ్రుతిహాసన్ , బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.