180కి పైగా గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్
చెరువులు ఆక్రమణ వల్లనే భాగ్యనగరానికి ముంపు. నాడు ఇంజనీర్ పితామహుడు మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన సూచనలు ఏమిటంటే భాగ్యనగరం ముంపు నుంచి కాపాడాలంటే ప్రస్తుతం ఉన్న చెరువు లను కాపాడుకోవాలి.చెరువులలో రెండేళ్ల కు ఒకసారి పూడికలు తీయాలి.1908లో కురిసిన భారీ వర్షాలకు మూసీనది పొంగి పోయింది. 10,000 మందికి పై గా చనిపోయారు.అపుడు నిజాం నవాబు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.అపుడే మోక్ష గుండం విశ్వేశ్వరయ్య హై దరాబాద్ వచ్చి చర్యలు చేపట్టారు. అనంతరం 1970లో కురిసిన భారీ వర్షాలకు మూసీనదికి తిరిగి వరదలు వచ్చి భాగ్యనగరం నీట మునిగిపోయింది.

ఒక్క హైదరాబాద్ లో ఇన్ని చెరువులా అని ఆశ్చర్యపోతారేమో గానీ అదే నిజం.
-
- హుస్సేన్ సాగర్
- ఉస్మాన్సాగర్
- హిమయత్ సాగర్లతో పాటూ
- మంత్రాల చెరువు,
- కొత్త చెరువు,
- ఐడీపీఎల్ చెరువు,
- హస్మత్పుర చెరువు,
- బాలాజీనగర్ చెరువు,
- కౌకూర్ చెరువు,

- సూరారం చెరువు,
- లింగంచెరువు,
- వెన్నెలగడ్డ చెరువు,
- ప్రగతినగర్ చెరువు,
- కాప్రా చెరువు,
- కీసర చెరువు,
- పూడురు చెరువు,
- ఎల్లమ్మపేట చెరువు,
- మేకంపూర్ చెరువు,
- నల్లచెరువు,
- పల్లె చెరువు,

-
- దుర్గం చెరువు,
- రామంతపూర్ చెరువు,
- సఫీల్ గూడ చెరువు,
- అల్వాల్ చెరువు,
- సరూర్ నగర్ చెరువు,
- అమీనాపూర్ చెరువు,
- జీడిమెట్ల చెరువు,
- బంజారా చెరువు (బంజారాహిల్స్)
- షామీర్ పేట్ చెరువు
- నారాయణరెడ్డి కత్వా,
- బాచారం కత్వా,
- హీరా కత్వా,

-
- రాయిన్చెరువు,
- మాలోనికుంట,
- అంట్ల మాసమ్మకుంట,
- మైసమ్మ చెరువు,
- పెద్ద చెక్ డ్యాం,
- మెట్టు కత్వా,
- బుంగ కత్వా,
- బూబాగడ్డ చెక్ డ్యాం,
- ఎర్రబండ చెక్డ్యాం,
- బంధంకుంట,
- బైరాంఖాన్ చెరువు,

-
- ఈదులచెరువు,
- దిల్వార్ఖాన్ చెరువు,
- పోల్కమ్మ చెరువు,
- అంతాయపల్లి చెరువు,
- కుంట్లూర్ చెరువు,
- కంబాలకుంట,

- మాసబ్ చెరువు,
- వడ్లకుంట,
- కొత్త చెరువు,
- బందకుంట,
- అమీర్పేట,
- యూసుఫ్గూడ చెరువు,
- శ్యామలకుంట సనత్నగర్,
- మైసమ్మకుంట,
- చాపల చెరువు
ఇవే గాక
తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్ చెరువు, కోమ కుంట, కోమార్కుంట, గొల్లవాని కుంట, భజన్సాహికుంట, బొంగలకుంట, షాన్ కీసమున కుంట, హెచ్ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్లాల్ లే అవుట్ చెరు వు, బండకుంట, సుదర్శన్ చెరువు, అంజయ్య చెరువులు పూర్తిగా కనిపించకుండా పోయాయి.

ఇప్పుడు నగరం నీళ్లు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వస్తుంది అనేవాళ్ళు గమనించాల్సింది నగరమే చెరువులోకి చొచ్చుకొని పోయిందని. డ్రైనేజీలో పాడేసిన బాటిళ్లను చూపించి వరదలకు కారణం, మన బాధ్యాతారాహిత్యం అనేవాళ్ళూ కూడా ఇదే గుర్తించుకోవాలి. చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన వారిదే నేరమంతా. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పాపమంతా. ఎంతో ముందుచూపుతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిజాం కట్టాడు. ఇంత మోడ్రన్ వసతులున్నా ఈ పాలకులు వాటిని అభివృద్ధి చేయలేదు. నగరంలో మంచి నీటి చెరువులు (హుస్సేన్ సాగర్ తో సహా) మురికికూపాలు అవుతుంటే చూస్తూ ఉన్నారు.
-టి.వి.గోవిందరావు