AP: 25వేల మందికి రేపు ఇళ్ల పట్టాల పంపిణీ: బాలినేని
ప్రకాశం (CLiC2NEWS): రాష్ట్రంలో పూరి గుడిసెలేని ఇంటిని చూడాలనే లక్ష్యంతో రేపు పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని తెలిపారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని వారికి శుక్రవారం రిజిస్ట్రేషన్ పత్రాలు అంజేయనున్నారు. కష్టం కాలంలో కూడా సిఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 231 కోట్ల రూపాలయల నిధులు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా రేపు ఇళ్ల పట్టాల పత్రాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా రేపు తాగు నీటి ప్రాజెక్టుకు కూడా సిఎం శంకుస్థాపన చేయనున్నారు.