నాయిని నర్సింహారెడ్డి భార్య కన్నుమూత

హైదరాబాద్‌ : మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య (68) కన్నుమూశారు. నాయిని మృతి నుంచి తేరుకొకముందే ఆ కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. కాగా నాయిని ఈ నెల 22న మరణించిన విషయం తెలిసిందే. ‌ఇటీవల నాయిని, ఆయన భార్య అహల్య కరోనా బారిన పడ్డారు. దీంతో ఇద్దరు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతితో ఆఖరి చూపుకు అహల్యను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆమె కరోనా నుంచి కోలుకున్నా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.