ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు రావాల‌ని కెసిఆర్‌కు ఆహ్వానం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వపు వేడుక‌ల‌కు రావాల‌ని మాజి సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ్వానం పంపించింది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసి కెసిఆర్‌ను ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వ ప్రోటోకాల్ స‌ల‌హాదారు హ‌ర్క‌ర్ వేణుగోపాల్ , డైరెక్ట‌ర్ అర‌వింద్ సింగ్‌లు సిఎం సూచ‌న మేర‌కు ఆహ్వాన‌లేఖ‌, ప‌త్రిక తీసుకొని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం.

తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ హాజ‌రుకానున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి సోనీయా గాంధీని నేరుగా క‌లుసుకొని ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.