సిఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడ సమీపంలో జరిగిన భారీ సభలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా అతిరథ మహారథులు హాజరయ్యారు.