కొలువు దీరిన ఎపి కొత్త మంత్రివర్గం

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం విజయవాడ సమీపంలో జరిగిన భారీ సభలో ప్రమాణం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు.
తర్వాత మంత్రులుగా నారా లోకేశ్, కించరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల, రామానాయుడు, ఎన్ ఎండి ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్ధసారథి, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బిసి జనార్ధన రెడ్డి, టిజి భరత్, ఎస్. సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్, రామ్మోహన్ నాయుడు, మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా అతిరథ మహారథులు హాజరయ్యారు.