తిరుమ‌ల‌కు బైక్‌పై వెళ్లే వారిపై ఆంక్ష‌లు.. టిటిడి

తిరుమ‌ల (CLiC2NEWS): ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెలల్లో తిరుమ‌ల‌కు ద్విచ‌క్ర‌వాహన రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆంక్ష‌లు ఆగ‌స్టు 12 నుండి సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌నున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల‌కు మాత్ర‌మే రెండు ఘాటం రోడ్ల‌లో ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అనుమ‌తించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో వ‌న్య‌ప్రాణుల సంతానోత్ప‌త్తి అధికంగా ఉంటుంద‌ని.. భ‌క్తులతో పాటు వ‌న్య‌ప్రాణుల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. దీనికి భ‌క్తులు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Leave A Reply

Your email address will not be published.