గొల్కొండ కోట‌పై ఘ‌నంగా స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు

ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన సిఎం రేవంత్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు గోల్కొండ కోట‌పై ఘ‌నంగా నిర్వ‌హించారు. గురువారం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గోల్కొండ కోట‌పై జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం పోలీసు సిబ్బంది గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడారు.

అహింస‌నే ఆయుధంగా మ‌లిచి చేసిన మ‌హా సంగ్రామం మ‌న స్వాతంత్ర్య పోరాట‌మ‌ని సిఎం అన్నారు. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ లో భాగంగా తెలంగాణ‌లో రుణ‌మాఫీ అమ‌లు చేస్తున్నాం అని అన్నారు. ఇచ్చిన అరు గ్యారెంటీల్లో ఇప్ప‌టికే అమ‌లు చేశామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్న‌ట్లు సిఎం తెలిపారు. అలాగే పెండింగ్ ద‌ర‌ణి ద‌ర‌ఖాస్తుల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించిన‌ట్లు సిఎం తెలిపారు. తెలంగాణ‌ను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాల‌ని సిఎం తెలిపారు. ఈకార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.