గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఐదుగురు మృతి
గువ్వల చెరువు (CLiC2NEWS): వైఎస్ ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గువ్వల చెరువు ఘాట్రోడ్డులో చింతకొమ్మదిన్నె పరిధిలో కారు-కంటైనర్ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు కంటైనర్ డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. వీరంతా చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టింది.