బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. బాధిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం

బెంగ‌ళూరు (CLiC2SNEWS): ఆర్‌సిబి విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మంలో బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిస‌లాట కార‌ణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌నపై సిఎం సిద్ద‌రామ‌య్య దిగ్భ్రాంది వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆయ‌న ప‌రామ‌ర్శించారు. మృతుల కుటుంబాల‌కు రూ.10ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి ఉచిత వైద్యం అంద‌జేస్తామ‌న్నారు.

 

Leave A Reply

Your email address will not be published.