Hyderabad: ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం తిని ఒక‌రు మృతి.. ఏడుగురికి అస్వ‌స్థ‌త‌

వ‌న‌స్థ‌లిపురం (CLiC2NEWS): ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాహారం వేడి చేసి తిన్న కుటుంబంతో ఒక‌ర మృతి చెంద‌గా.. మ‌రో ఏడుగురు అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురం, చింత‌ల్‌కుంట‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. చింత్‌కుంట ఆర్టిసి కాల‌నిలో ఉంటున్న శ్రీ‌నివాస్ కుటుంబం ఆదివారం బోనాల పండ‌గ సంద‌ర్బంగా మ‌ట‌న్, బోటి, చికెన్ వండుకొని తిన‌గా మిగిలిన‌ది ఫ్రిజ్‌లో పెట్టారు. సోమ‌వారం ఆ మాంసాన్ని వేడి చేసి మ‌ళ్లీ తిన‌గా.. కుటుంబంలోని స‌భ్యులంద‌రూ అనారోగ్యానికి గుర‌య్యారు. వాంతులు, విరోచ‌నాల‌తో స‌మీప ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మంగ‌ళ‌వారం శ్రీ‌నివాస‌వ్ యాద‌వ్ మృతి చెందారు. మిగిలిన వారు ఆస్ప‌త్రిలో చికిత్స‌నందిస్తున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

1 Comment
  1. Hassan says

    Thanks for any other fantastic post. The place else could anybody get that
    type of information in such a perfect manner of writing?
    I’ve a presentation subsequent week, and I am on the
    search for such information.

Leave A Reply

Your email address will not be published.