నిజామాబాద్: బోధన్లో ఉగ్ర కలకలం..
బోధన్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం ఎన్ ఐఎ అధికారులు అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారు జామున స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ ఐఎ, పటియాలా పోలీసులు బోధన్ పట్టణంలో తనిఖీలు చేపట్టారు. ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిత ఉగ్రవాదిని ఎన్ ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ ఐఎ దేశ వ్యాప్తంగా ఐసిస్తో సంబంధాలు ఉన్న వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పట్టుబడ్డ హుజైఫా ఎమన్ను బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పిటి వారెంట్ పై ఢిల్లీకి తరలించారు. అతని వద్ద నుండి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్ను అరెస్టు చేసిన అనంతరం అతను ఇచ్చిన సమాచారం మేరకు దేశ వ్యాప్తంగా ఐసిస్ తో సబంధాలు ఉన్న వారిని జల్లెడ పట్టారు. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా తెలంగాణలోని నిజామాబాద్ బోధన్ లో ఎన్ ఐఎ అధికారులు తనిఖీలు నిర్వహించారు.