తెలంగాణలో 857 కొత్త కేసులు.. 4 మరణాలు

కేసులకన్నా.. డిశ్చార్జ్‌లే ఎక్కువ

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 23,806 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 857 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,51,188కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1381కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న ఒక్క రోజే 1,504 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,30,568కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 16,449 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 46,42,276కి చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 250, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 35, జగిత్యాల్‌ 27, జనగాం 10, జయశంకర్ భూపాలపల్లి 1, జోగులమ్మ గద్వాల్‌ 2, కామారెడ్డి 1, కరీంనగర్‌ 48, ఖమ్మం 25, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 2, మహబూబ్‌ నగర్‌ 14, మహబూబాబాద్‌ 16, మంచిర్యాల్‌ 20, మెదక్‌ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 61, ములుగు 1, నాగర్‌ కర్నూల్‌ 17, నల్గొండ 30, నారాయణ్‌పేట్‌ 1, నిర్మల్‌ 6, నిజామాబాద్‌ 0, పెద్దంపల్లి 17, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 88, సంగారెడ్డి 36, సిద్ధిపేట్‌ 25, సూర్యాపేట 18, వికారాబాద్‌ 3, వనపర్తి 8, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 38, యాద్రాది భువనగిరి 5 కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.