తిరుపతికి సమీపంలో వాయుగుండం

అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొద్దిగంటల్లో మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.