పురపాలక శాఖలో 3,878 ఖాళీలు!
పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత మూడు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు.
ఎలాంటి వివాదాలకు తావులేకుండా నియామకాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్.. అన్నిశాఖల కార్యదర్శులు, జీఏడీ అధికారులతో పలుసార్లు భేటీ అయ్యారు. ఖాళీలు, ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలతోపాటు నియామకాలు ఎలా చేపట్టాలన్నదానిపై చర్చించారు. చాలావరకు ఖాళీల వివరాలు శనివారం సాయంత్రానికి జీఏడీకి చేరాయి. మిగిలిన శాఖలు కూడా ఖాళీలు, అక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నవారి వివరాలతో జాబితాను రూపొందిస్తున్నాయి. సోమవారం సాయంత్రం వరకు సమాచారమంతా హెచ్వోడీలకు అందించనున్నాయి. జిల్లాలనుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పూర్తి వివరాలను శాఖలవారీగా జీఏడీకి పంపిస్తారు. వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఖాళీల పూర్తి వివరాలను జీఏడీ ప్రభుత్వానికి అందించనున్నది. ఈ కసరత్తును నేడు (సోమవారం) వరకు పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పురపాలక శాఖలో..
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో 122, హెచ్ఎండీఏలో 191, ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) పరిధిలో 432, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ)లో 233, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా)లో 70, జీహెచ్ఎంసీలో 879, హైదరాబాద్ జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)లో 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. డీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నియామక ప్రకటనలు రానున్నాయి. జీహెచ్ఎంసీ, జల మండలి, హెచ్ఎండీఏ, కుడా పరిధిలోని ఖాళీలను శాఖాపరమైన నియామకాల ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
దేవాదాయ శాఖలో..
రాష్ట్ర దేవాదాయ శాఖలో మొత్తం 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ (2), అసిస్టెంట్ కమిషనర్లు (12), అసిస్టెంట్ ఇంజనీర్లు (3), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–1 (4), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్–3 (81), జూనియర్ అసిస్టెంట్స్ (16), ఎల్డీసీ (1), టైపిస్టు కమ్ స్టెనో (9).
వ్యవసాయశాఖలో…
తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 761 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిలో వేర్హౌసింగ్లో ఎక్కువగా 312 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఇతర విభాగాల్లో.. విత్తనాభివృద్ధి సంస్థలో 89, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలో 59, రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్లో 51, ఆగ్రోస్లో 74, హాకాలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది.
కేటగిరీ పోస్టుల సంఖ్య
పురపాలక శాఖ డైరెక్టరేట్ (డీఎంఏ)లో..
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2 26
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3 6
హెచ్ఎండీఏలో..
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 37
ఏఈఈలు 54
పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలో..
ఏఈఈలు 175
ఏఈలు 75
టెక్నిల్ ఆఫీసర్ 11
కేటగిరీ పోస్టుల సంఖ్య డీటీసీపీలో..
అడిషనల్ డైరెక్టర్ టౌన్ప్లానింగ్ 20
టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ 6
టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 175
ఏఏడీఎం 10
కుడాలో..
జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 2
సర్వేయర్లు 10
జీహెచ్ఎంసీలో…
టౌన్ప్లానింగ్ సూపర్ వైజర్లు 200
వెటర్నరీ ఆఫీసర్లు 31
సానిటరీ ఇన్స్పెక్టర్లు 45
హెల్త్ అసిస్టెంట్లు 44
ఫీల్డ్ అసిస్టెంట్లు 120
టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 60
టౌన్ సర్వేయర్లు 30
కేటగిరీ పోస్టుల సంఖ్య
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో..
మేనేజర్ (ఇంజనీరింగ్) 159
టెక్నిషియన్ గ్రేడ్–2 72
జనరల్ పర్పస్ ఎంప్లాయి (సిబ్బంది) 110
జనరల్ పర్పస్ ఎంప్లాయి
(వాటర్ సప్లై జనరల్) 1,114
జనరల్ పర్పస్ ఎంప్లాయి
(సివరేజీ జనరల్) 297