60 మంది ప్ర‌యాణికుల‌తో కోట‌ప్ప‌కొండ‌కు వెళ్తున్న బ‌స్సు బోల్తా..

అద్దంకి (CLiC2NEWS): కోట‌ప్ప‌కొండ‌కు వెళ్తున్న బ‌స్సు.. అద్దంకి మండ‌లం తిమ్మాయ‌పాలెం వ‌ద్ద బోల్తా ప‌డింది ఈప్ర‌మాదంలో 40 మంది గాయ‌ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పుట్టు వెంట్రుక‌ల మొక్కు తీర్చుకునేందుకు బాప‌ట్ల జిల్లా తాళ్లూరు మండ‌లం బొద్ద‌కూర‌పాడు, కొర్ల‌మ‌డుగు గ్రామాల‌కు చెందిన సుమారు 60 మంది కోట‌ప్ప‌కొండ‌కు ఓస్కూల్ బ‌స్సులో బ‌య‌లుదేరి వెళ్లారు. బ‌స్సు క‌ట్ట‌ర్ విరిగి పోవ‌డంతో తిమ్మాయ‌పాలెంలోని ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం స‌మీపంలో బ‌స్సు బోల్తాప‌డింది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి అద్దంకి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.