India Corona: కొత్త‌గా 4,194 మరణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాలు నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగాయి. కొత్తగా 4,194 మంది మహమ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దేశంలో ఈ మహమ్మారి బారినపడి 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 3,57,630 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2,30,70,365 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.