రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ: మంత్రి తుమ్మల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నేడు రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న వారికి ఈ సాయం అందనుంది. దీనికోసం మరో రూ.513 కోట్లు నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,284 కోట్లు జమ అయినట్లు మంత్రి వెల్లడించారు.