అంబులెన్స్‌ బైక్‌ నడిపిన ఎమ్మెల్యే రోజా

నగరి : అబులెన్స్ బైక్ న‌డిపి అంద‌రిని అబ్బుర‌ప‌ర‌చిన సినీన‌టి, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కె రోజా. న‌గ‌రికి చెందిన ఒక మోటారు సంస్థ పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్‌ బైక్‌లను ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతులమీదుగా ఆదివారం అందజేసింది. అనంతరం జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచార‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇన్నాళ్లూ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేశారు. వీరిద్దరి అబద్ధాలకు చెంపపెట్టులా పారిశ్రామికవేత్తలు సీఎం వైఎస్‌ జగన్‌పై సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రోజా బైక్ స్వ‌యంగా న‌డిపి అంద‌రిని ఆక‌ట్టుకోవ‌డం విశేషం.

Leave A Reply

Your email address will not be published.