పూర్తి ఆరోగ్యంతో సిఎం కెసిఆర్‌

కరోనా లక్షణాలు పోయాయి.. వ్య‌క్తిగ‌త వైద్యుడు ఎంవి రావు వెల్ల‌డి

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు త‌గ్గిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని ఆయ‌న వ్య‌క్తిగ‌త వైద్యుడు ఎంవి రావు తెలిపారు. ముఖ్య‌మంత్రికి సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, సిటీ స్కానింగ్ చేశామ‌ని, అంతా సాధార‌ణంగానే ఉంద‌న్నారు. ఊపిరితిత్తుల‌కు ఎటువంటి ఇన్ఫెక్ష‌న్ లేద‌ని, ఆక్సిజ‌న్ స్థాయిలు సైతం బాగానే ఉన్నాయ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఆయ‌న విధుల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. సిఎం కెసిఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేశారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలు సేకరించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం రానున్నాయి. సిఎం వెంట మంత్రి కెటిఆర్‌, ఎంపి సంతోష్‌కుమార్‌ ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.

సోమాజిగూడ య‌శోదా ఆసుప‌త్రిలో సిటి స్కానింగ్ చేయించుకుని బ‌య‌టికి వ‌స్తున్న ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

కరోనా లక్షణాలు పోయాయి: డాక్టర్ ఎంవి రావు
ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కెసిఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు తెలిపారు. బుధవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకొని త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉన్నదని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.