గుండెను భ‌ద్రంగా ఉంచే బాదం..!

కరోనా వైరస్ వ్యాప్తితో ఎక్కడ చూసినా ప్రజల్లో భయాందోళన కనిపిస్తుంది. అయితే డాక్టర్లు మాత్రం బలవర్ధక ఆహారాన్ని తీసుకోండి. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, తద్వారా కోవిడ్19 బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చునని చెబుతున్నారు. కరోనా సమయంలో ఎక్కువగా గిరాకీ వచ్చిన ఐటమ్స్‌లో బాదం ఒకటి. చలికాలంలో 5-6 బాదం పప్పులు తినాలట. అదే వేసవికాలంలో 3-4 తింటే సరిపోతుందట. ఓ నాలుగైదు బాదం పప్పులు తింటే మీ శరీరానికి ఎంతో శ్రేయస్కరం.

బాదం తరచుగా తినేవారికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి నాలుగైదు రోజులు బాదం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీవితాంతం మనల్ని మంచి ఆరోగ్యవంతులుగా ఉంచే బాధ్యతను బాదం తీసుకుంటుంది. ప్రతిరోజూ నాలుగు బాదంలు తింటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ అయితే, వీటిని పొట్టుతో తీసుకోవడం కంటే రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తింటే, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

బాదం తినడం వల్ల ప్రయోజనాలు

  • ప్రతిరోజూ ఉదయం బాదం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • తెల్లరక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.
  • బాదం తింటే విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.
  • బాదం మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొవ్వును నియంత్రిస్తుంది.
  • బాదంలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
  • తరచుగా బాదం తినడం వల్ల మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుంది.
  • బాదం తింటే మీకు కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. ఇందులో సోడియం తక్కువ కనుక రక్తపోటు సమస్య అసలే ఉండదు. రక్తప్రసరణ సరిగా జరిగి గుండె సంబంధిత సగం జబ్బులకు పరిష్కారం దొరికినట్లే.
  • ఉదయాన్నే బాదం తింటే శరీరానికి కావలసిన ఇనుము లభిస్తుంది.
  • బాదంలో ఉంటే మోనోశాచ్యురేటెడ్, పాలీశాచ్యురేటెడ్స్ శరీరంలో నిల్వ ఉండే చెడు కొవ్వులను నాశనం చేస్తుంది.

-పూర్ణిమ‌

Leave A Reply

Your email address will not be published.