హ‌మాస్ చెర నుండి మ‌రో 13 మంది విడుద‌ల‌

గాజా (CLiC2NEWS): హ‌మాస్ వ‌ద్ద ఉన్న ఇజ్రాయిల్ పౌరుల‌ను ముందుగా శుక్ర‌వారం 24 మందిని విడుద‌ల చేసింది. అనంత‌రం శ‌నివారం అర్ధ‌రాత్రి మ‌రో 13 మందిని విడుద‌ల చేసింది. ఇజ్రాయిల్‌- హ‌మాస్ మ‌ధ్య గుదిరిన ఒప్పందం ప్ర‌కారం 50 మంది బందీల‌ను హ‌మాస్ విడుద‌ల‌చేయాలి. అదేవిధంగా 150 మంది పాల‌స్తీనా బందీల‌ను సైతం ఇజ్రాయిల్ విడుద‌ల చేయాల్సి ఉంది.
విడుద‌ల చేయాలి. కానీ కాస్త జాప్యం జ‌రుగుతోంది.

హ‌మాస్ బందీల‌ను విడుద‌ల చేసిన వెంట‌నే ఇజ్రాయిల్ 39 మంది పాలస్తీనా వాసుల‌ను విడుద‌ల చేసింది. హ‌మాస్ విడుద‌ల చేసిన వారిలో ఏడుగురు చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు ఉన్నట్లు స‌మాచారం. తొలిద‌శ‌లో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన 10 మందిని, ఓ ఫిలిప్పీన్స్ జాతీయుడిని హ‌మాస్ విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.