మధ్యప్రదేశ్లో ట్రక్కు బోల్తాపడి 14 మంది మృతి
దిండోరి (CLiC2NEWS): మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు మరో 20 మంది గాయపడినట్లు సమాచారం. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన వారిని షాహ్పుర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర సిఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.