రూ. 75వేల మార్కు దాటిన బంగారం

ఢిల్లీ (CLiC2NEWS): ప‌సిడి ధ‌ర రోజురోజుకి పైపైకి పోతుంది. తాజాగా 24 క్యారెట్ల‌ బంగారం ధ‌ర‌ రూ. 75 వేల మార్కును దాటింది శుక్ర‌వారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ. 75,550గా న‌మోదైంది, ఒక్క‌రోజులో దాదాపు వెయ్యు రూపాయ‌ల మేర పెరిగింది. అంత‌ర్జాతీయంగా బంగారానికి గిరాకి పెర‌గ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. దాని ఫ‌లితంగా దేశీయంగా ప‌సిడి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయ‌ని అంటున్నారు. బంగారంతో పాటు శుక్ర‌వారం వెండి ధ‌ర సైతం పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ. 1400 మేర పెరిగి రూ. 86, 300కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.