సంక్రాంతి రద్దీ.. మరో 11 ప్రత్యేక రైళ్లు..
హైదరాబాద్ (CLiC2NEWS): సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో అధనంగా పలు రైళ్ల సర్వీసులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 11 ప్రత్యేక రైళ్ల సర్వీసులను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీసులు జనవరి 7 నుండి 12వ తేదీ మధ్య నడపనున్నారు. తాజాగా ప్రకటించిన రైళ్ల సర్వీసులకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని తెలిపారు.
రైళ్ల వివరాలు:
కాకినాడ- వికారాబాద్,
వికారాబాద్- పార్వతీపురం
పార్వతీపురం-వికారాబాద్
పార్వతీపురం-కాకినాడ టౌన్
సికింద్రాబాద్-పార్వతీపురం
కాకినాడ టౌన్-వికారాబాద్

[…] సంక్రాంతి రద్దీ.. మరో 11 ప్రత్యేక రై… […]