తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు

హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో 118 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కరోనాతో రాష్ట్రంలో తాజాగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1613కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 2,96,134 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,92,696 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,825 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.