ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నల్లగొండలో భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి, ధర్మారెడ్డి, రాజయ్య, శంకర్‌ నాయక్ త‌దిత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.