మంచిర్యాల: ఇందారం ప్రభుత్వ పాఠశాలలో 9 మందికి కరోనా!
జైపూర్: మంచిర్యాల జిల్లాలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. ఈ మధ్య కాలంలో జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం రేపింది. తాజాగా జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాఠశాలలో కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7మంది విద్యార్థులకు, 1 ఉపాధ్యాయుడి, 1 వంట మనిషికి కలిపి మొత్తం 9మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కుందారం వైద్యాధికారి రజిని తెలిపారు.