తెలంగాణలో కొత్త‌గా 493 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా రాష్ట్రంలో 493 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు గురువారం ఉద‌యం రాష్ట్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791 కి చేరింది. ఇందులో 2,99,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,684 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,680 కి చేరిందని అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.