తైవాన్లో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి
హువాలియన్: తైవాన్లోని హువాలియన్ ప్రావిన్సులో రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు. డజన్ల కొద్ది గాయపడ్డారు. 350 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు ఓ టన్నెల్ వద్ద ఇంజినీరింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వాహనాన్ని ఢీకొట్టడంతో.. రైలు టన్నెల్లోనే పట్టాలు తప్పింది. టన్నెల్లో చిక్కుకున్న నాలుగు బోగీలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తైవాన్లో ప్రస్తుతం టాంబ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అక్కడ రైలు ట్రాఫిక్ భారీ స్థాయిలో ఉంటుంది. పట్టాలు తప్పిన బోగీల నుంచి సుమారు వంద మంది ప్రయాణికులను రక్షించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాకింగ్షుయి టన్నెల్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. రైలులో ఎక్కువ భాగం ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్నందున, తప్పించుకున్న ప్రయాణీకులు భద్రతకు చేరుకోవడానికి తలుపులు, కిటికీలు మరియు పైకప్పులను స్కేల్ చేయవలసి వచ్చింది. టోరోకో జార్జ్ సుందరమైన ప్రాంతానికి సమీపంలో ఉదయం 9 గంటలకు ప్రభుత్వ సెలవుదినం రోజున ఈ ప్రమాదం జరిగింది.
గతంలో తైవాన్ లో 2018 అక్టోబర్ లో జరిగినన రైలు ప్రమాదంలో ఈశాన్య తీరంలో ఒక గట్టి మూలలో చుట్టుముట్టేటప్పుడు ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది, కనీసం 18 మంది మరణించారు మరియు దాదాపు 200 మంది గాయపడ్డారు. 1991 లో, పశ్చిమ తైవాన్లో ision ఢికొన్న ప్రమాదంలో 30 మంది మరణించారు మరియు 112 మంది గాయపడ్డారు.