TS Corona: కొత్తగా 4,976 కేసులు.. 35 మ‌ర‌ణాలు

హైద‌రాబాద్‌(CLiC2NEWS): తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా కొత్తగా 4,976 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్యం 4,97,361 కి చేరింది. రాష్ట్రంలో కొత్త‌గా క‌రోనా బారిన ప‌డి 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2739కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 7646 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి ర‌కు రాష్ట్రంలో 4,28,865 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 65,757 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.