India Corona: 30వేల దిగువకు కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. 132
- తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.14కోట్లకు పెరిగింది.
- తాజాగా 42,363 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు మొత్తం 3,06,21,469 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు.
- కొత్తగా కరోనా బారిన పడి మరో 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,21,382 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.