Hyd: ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైదరాబాద్(CLiC2NEWS) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చ‌ర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. కావున తేదీ: 04.08.2021, బుధ‌వారం ఉద‌యం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 05.08.2021, గురువారం ఉద‌యం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్.

2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్.

3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ.

4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌత‌మ్ న‌గ‌ర్.

5. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్.

6. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 13 – మ‌హింద్ర హిల్స్.

7.ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కాన‌గ‌ర్, బీరప్పగడ్డ.

8. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు.

9. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జ‌ల‌మండ‌లి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.