Hyderabad: పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు చాంద్రాయన్గుట్ట ఓమర్ హోటల్ వద్ద ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగనున్న నేపథ్యంలో మిరాలం ఆలియాబాద్ ఆఫ్టేక్ పైప్లైన్ అలైన్మెంట్ మార్చాల్సి ఉంది.
కావున తేదీ: 11.10.2021, సోమవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 12.10.2021, మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు వరకు మిరాలం ఆలియాబాద్ ఆఫ్టేక్ నుంచి నీటి సరఫరా జరిగే రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 -మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2- అలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాలు.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటినిపొదుపుగావాడుకోగలరనికోరడమైనది.
సం/-
పౌర సంబంధాల అధికారి.