ఢిల్లీలో పాకిస్థాన్ ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ (CLiC2NEWS): పాకిస్థాన్కి చెందిన ఓ ఉగ్రవాదిని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది పాకిస్థాన్కు చెందిన మహ్మద్ అష్రఫ్ గా గుర్తించారు. అతను నకిలీ గుర్తింపు కార్డుతో భారత్లో నివసిస్తున్నాడని, స్లీపర్ సెల్లో కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. అతని వద్దనుండి ఏకే-47 తుపాకీ, 60 రౌండ్ల బుల్లట్లు, ఒక హ్యాండ్ గ్రనేడ్, రెండు పిస్టోళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉగ్రవాదిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక)చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.