Punjab: విద్యుత్ ఛార్జీలు యూనిట్కు రూ.3 తగ్గింపు

చండీగఢ్ (CLiC2NEWS): దీపావళి సందర్భంగా పంజాబ్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను యూనిట్కు మూడు రూపాయల మేర తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎను 11 % పెంచింది.
పంజాబ్ లో 7 కిలోవాట్ల వరకు లోడ్ ఉన్న వినియోగదారులకు యూనిట్కు రూ. 3 చొప్పున విద్యుత్ టారిఫ్ను తగ్గించాలని నిర్ణయించినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం మంత్రి మండలి సమావేశం తర్వాత ప్రకటించారు.
అలాగే జూలై 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ 11% (డీఏ) పెంచారు.
క్రీమీ లేయర్తో కూడిన 5% వినియోగదారులు (7 KW కంటే ఎక్కువ మంజూరైన లోడ్తో 2. 38 లక్షల మంది వినియోగదారులు) మినహా చౌకైన విద్యుత్తు యొక్క ప్రయోజనం అన్ని స్లాబ్లలో వర్తిస్తుందని చన్నీ చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం 71.75 లక్షల మందిలో 69 లక్షల మంది గృహ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. తగ్గిన విద్యుత్ ఛార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తెలిపారు.
ఒక్కో యూనిట్ ధరను రూ.3 తగ్గించినట్లు సీఎం పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి తక్కువ విద్యుత్ ఛార్జీలు ఉన్న రాష్ట్రంగా పంజాబ్ మారిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త ఛార్జీలు అమలవుతాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 69లక్షల గ్రామీణ కుటుంబాలు లాభపడతాయని సిఎం వివరించారు.
ఈ నిర్ణయం వల్ల ఏడాదికి సబ్సిడీ కింద రూ.3316 కోట్లు ఖర్చవుతుంది, రాష్ట్రం మొత్తం సబ్సిడీ బిల్లు రూ.14,000 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు.