World Kidney day: వంద రూపాయలకే కిడ్నీ పరీక్ష..!
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఓ గ్లోబల్ ఆసుపత్రి సరికొత్ ప్యాకేజీని ప్రారంభించింది. ఎల్బీనగర్లోని అవేర్ గ్లెనీగెల్స్ హాస్పిటల్ కేవలం రూ. 100 కే జిఎస్ ఆర్ పరీక్ష చేయనున్నట్లు పేర్కొంది. ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు ప్యాకేజీ అమలులో ఉంటుందిని హాస్సిటల్ యాజమాన్యం తెలిపింది. ఈ పరీక్ష ద్వారా కిడ్నీల పనితీరు తెలుకొవచ్చని డాక్టర్ సత్వీందర్ సింగ్ సబర్వాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వంద శాతం మందిలో ముప్పై శాతం మంది డయాలసిస్తో బాధపడుతున్నారు. వారిని ముందే గుర్తించినట్లయితే తగిన వైద్యం చేయవచ్చని పేర్కొన్నారు.