ర‌థోత్స‌వంలో అగ్ని ప్ర‌మాదం..11 మంది స‌జీవ‌ద‌హ‌నం

తంజావూరు (CLiC2NEWS): త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక క‌రిమేడు అప్ప‌ర్ దేవాల‌యంలో నిర్వ‌హించిన ర‌థోత్స‌వంలో విద్యుదాఘాతంతో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది భ‌క్తులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మ‌ర‌ణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

విద్యుదాఘాతం జ‌రిగిన వెంట‌నే భారీగా మంట‌లు ఎగ‌సిప‌డిన‌ట్లు తెలుస్తోంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.
క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.