కాబుల్‌లో మసీదుపై బాంబుదాడి.. 50 మందికిపైగా మృతి

కాబుల్ (CLiC2NEWS): అఫ్గానిస్థాన్‌లో మ‌రోసారి బాంబు దాడి జ‌రిగింది. రాజ‌ధాని కాబుల్‌లోని ఓ మ‌సీదు వ‌ద్ద ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ దాడిలో 50 మందిపై గా మృతి చెంద‌న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది తీవ్రంగా గాయాల‌పాల‌య్యారు. స్థానిక ఖ‌లీఫా సాహిబ్ మ‌సీదు వ‌ద్ద శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం రంజాన్ ప్రార్థ‌న‌లు ముగించుకుని వెళ్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో తొలుత 10 మంది గాయ‌ప‌డిన‌ట్లు తాలిబ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 50కిపైగా పెరిగిన‌ట్లు మ‌సీదు నేత‌లు వెల్ల‌డించారు.
ప‌విత్ర రంజాన్ మాసంలో సామాన్య ప్ర‌జ‌ల‌నే ల‌క్ష్యంగా చేసుకుని దేశంలో వ‌రుస దాడులు జ‌రుగుతున్నాయి. గ‌త వారం మ‌జ‌ర్ ఈ షెరీఫ్ ప‌ట్ట‌ణంలోని ఓ మ‌సీదుపై జ‌రిగిన దాడిలో 33 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.