Sarkaru Vaari Paata: ‘మ‌.. మ‌మ‌.. మ‌హేశా’.. అంటోంది కీర్తి సురేశ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌హేశ్‌బాబు క‌థానాయ‌కుడుగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘స‌ర్కారు వారి పాట’. ఈ చిత్రం మే 12వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శ‌నివారం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తాజాగా ‘మ‌.. మ‌మ‌.. మ‌హేశా.. ము.. ము.. ముస్తాబ‌యి ఇట్టా వ‌చ్చేశా’ అంటూ సాగే లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌కు త‌మ‌న్ స్వ‌రాలు స‌మాకూర్చారు. శ్రీ‌కృష్ణ‌, జ‌నితా గాంధీ ఆల‌పించారు.

Leave A Reply

Your email address will not be published.