బ్యాంక్ నుండి న‌గ‌దుతో క్యాషియ‌ర్ ప‌రారీ!

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలోని వ‌న‌స్థ‌లిపురం బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో న‌గ‌దు మాయ‌మైంది. క్యాషియ‌ర్ ప్ర‌వీణ్ రూ. 22.53 ల‌క్ష‌లు తీసుకెళ్లాడ‌ని బ్యాంక్ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిన్న మ‌ధ్యాహ్నం క్యాషియ‌ర్ డ‌బ్బులు తీసుకొని ప‌రారైన‌ట్లు అందులో పేర్కొన్నారు. మ‌రోవైపు ప్ర‌వీణ్ కూడా కుటుంబ‌స‌భ్యుల‌కు అందుబాటులో లేడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్లు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.