తెలంగాణలో తొలి లైన్ ఉమెన్..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ శాఖలో లైన్ ఉమెన్. లైన్ ఉమెన్ ఉద్యోగం దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. టిఎస్ ఎస్పిడిసిఎల్లో తొలిసారిగా ఈ ఉద్యోగం సాధించిన బబ్బూరి శిరీషకు టిఎస్ ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డితో కలిసి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో మహిళలకు ఈ ఉద్యోగాలకు అవకాశం లేదని, గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం మేరకు 200కు పైగా లైన్ ఉమెన్లను ట్రాన్స్కోలోకి తీసుకున్నామని తెలిపారు.