మే 16 నుండి సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ప్ర‌వేశం ఉచితం..

హైదరాబాద్ (CLiC2NEWS): ఈ నెల 16 వ తేదీ నుండి 21వ తేదీ వ‌ర‌కు వారం రోజుల పాటు సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పించ‌నున్న‌ట్లు మ్యూజియం డైరెక్ట‌ర్ నాగేంద‌ర్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. మే 18వ తేదీన అంత‌ర్జాతీయ మ్యూజియం దినోత్స‌వం సంద‌ర్బంగా సాలార్‌జంగ్ మ్యూజియంలో వేడుక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ నెల 16 నుండి 21 వ‌ర‌కు విభిన్న కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయ‌ని, ఈమేర‌కు సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తిరోజు ఉద‌యం 10 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు మ్యూజియం తెరిచి ఉంటుంద‌ని, కుటుంబ స‌మేతంగా త‌ర‌లివ‌చ్చి కార్య‌క్ర‌మాలు వీక్షించ‌వ‌చ్చ‌ని కోరారు. భార‌త స్వాతంత్య్రంను సూచించే 75 వ‌స్తువుల‌తో ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని, బిద్రి త‌యారీపై ఒక రోజు వ‌ర్క్‌షాప్‌, ఉప‌న్యాసం ఉంటుంద‌ని వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.